రైతు ఐక్యవేదిక సంఘం నేతల డిమాండ్
నిజామబాద్,మార్చి8(జనం సాక్షి):తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగితే రాష్ట్రంలో మూతపడిన మూడు షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించి రైతులను ఆదుకుంటామని హావిూలు ఇచ్చి మరిచారని రైతు ఐక్యవేదిక సంఘం నాయకులు అన్నారు. ఇప్పటికీ ఆ ఊసే ఎత్త డం లేదని ఆరోపించారు. హావిూలు నీటి మూటలు గానే మిగిలి పోతున్నాయని పేర్కొన్నారు. ముత్యంపేట్, సారంగపూర్, బోదన్ షుగర్ ఫ్యాక్టరీలను వెంటనే తెరిపిస్తామని తీర్మానాలు చేయాలని డిమాండ్ చేశారు.కేవలం ఓట్ల కోసమే రైతులను వాడుకుంటున్నారని అన్నారు. ఎన్నికలు రాగానే ప్రతీ ఒక్కరూ రైతు సంక్షేమం గురించి మాట్లాడుతారన్నారు. రూ.100కోట్ల ఒక్కో షుగర్ఫ్యాక్టరీకి కేటాయించాలన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతోనే పసుపు పండిరచే రైతుకు మేలు జరుగుతుందని ఐక్యవేదిక సంఘం నాయకులు పేర్కొన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. పసుపుకు మధ్దతు ధరతోపాటు రూ.15వేలు క్వింటాలుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓట్ల సమ యంలోనే రైతులను గుర్తించి, మోసపూరిత వాగ్దానాలు చెప్పి వారి ఓట్లతో గెలిచి వారిని ఐదేళ్లుగా పట్టించుకోరని ఆవేదన వ్యక్తంచేశారు.
మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలి
Other News
- మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం..:బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్
- ఆధ్యాత్మిక వికాసానికి నిలయాలు దేవాలయాలు హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ గారు.
- మహిళా రెజ్లర్ల పై లైంగిక దాడికి పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ కి మద్దతుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
- పేరుకే ప్రాథమిక వ్యవసాయ కేంద్రాలు డైరెక్టర్లు పట్టించుకోకపోతే రైతుల పరిస్థితి ఏమిటి.
- రాష్ట్ర దశాబ్ది వేడుకలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్
- బండి కొమురయ్యకు పెన్షన్ మంజూరు పట్ల హర్షం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- సోమారపు ఆశయ్య కుటుంబానికి అండగా ఉంటాం
- పండుగ వాతావరణంలో వైభవోపేతంగా దశాబ్ది వేడుకల నిర్వహణ..... జిల్లా కలెక్టర్ శ్రీమతి షేక్ ఈ యాస్మిన్ భాష
- యేసు రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్