సికింద్రాబాద్ అస్తిత్వం దెబ్బతీసేందుకు కుట్ర
` ప్రభుత్వ చర్యలపై పోరాటం ఆపేది లేదు
` మండిపడ్డ బీఆర్ఎస్ నేత కేటీఆర్
`బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్, సికింద్రాబాద్ కు ఎంతో చరిత్ర ఉందని.. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తుగ్లక్ గురించి పుస్తకాల్లో చదువుకున్నాం.. ప్రత్యక్షంగా తుగ్లక్ అంటే ఎలా ఉంటాడో కనిపిస్తుందని విమర్శించారు. మొట్టమొదటి పని టీఎస్ను టీజీగా చేశారు.. దీనివల్ల ఏ పేదవాడికి న్యాయం జరిగిందో తెలియదు.. తెలంగాణ తల్లిని తీసేసి కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి పెట్టారన్నారు. ప్రజల దగ్గరికి పాలన పోవాలని అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలని వీకేంద్రీకరణను ఒక విశాల దృక్పథంతోనే కేసీఆర్ ప్రారంభించారని.. కొత్త గ్రామాలు మండలాలు రెవెన్యూ డివిజన్లు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చారని.. హైదరాబాదులోనూ వార్డులను జోన్లను పెంచడం జరిగిందన్నారు. వాటికి అభివృద్ధి నిధులను కూడా అధికంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ సికింద్రాబాద్ అనేది తెలంగాణ ప్రజల గొప్ప అస్తిత్వం చిహ్నాలు.. కానీ రేవంత్ రెడ్డి తీసుకున్న తుగ్లకు నిర్ణయం వలన సికింద్రాబాద్కి చారిత్రక గుర్తింపు పూర్తిగా పోయేటట్లు ఉన్నదని అభిప్రాయపడ్డారు. సికింద్రాబాద్లోని అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై.. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రజలంతా సంఘటితమై.. మా పార్టీని ఆహ్వానించడం జరిగిందని.. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మొత్తం మా పార్టీకి చెందిన వార అన్నారు. సికింద్రాబాద్లో పుట్టిన బిడ్డలుగా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్నారు.. అధికారం ఇచ్చింది పట్టణాల అస్తిత్వాలను ప్రజల అస్తిత్వాలను గుర్తు లేకుండా చేరుపడం కోసం కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.. ‘అధికారం ఇచ్చింది గ్యారెంటీలను అమలు చేయడానికి అధికారం ఇచ్చింది ప్రజలు వారికి మంచి చేయాలని.. కానీ ఇలాంటి ఒక్క పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయడం లేదు.. హైదరాబాద్ నగరంలో రెండు సంవత్సరాలుగా ఒక్క ఇటుక కూడా పెట్టలేదు.. ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఒక ఇల్లు కూడా కట్టలేదు.. కానీ నగరం మొత్తం తన విధ్వంసం ప్రణాళికలతోని ముందుకు పోతున్నారు.. ఈరోజు శాంతి ర్యాలీ పేరుతో సికింద్రాబాద్ ప్రజలు ప్రజాప్రతినిధులు ఒక కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపట్టారు.. ప్రజల కోరిక మేరకు ప్రజాప్రతినిధులని కోరిక మేరకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి వెళ్తామని సిద్ధంగా ఉన్నాం.. కానీ నిన్న రాత్రి వరకు అనుమతి ఉందని చెప్పి, ఇప్పుడు అనుమతి లేదని చెప్పి వేలాది మందిని కార్పొరేటర్లను, మాజీ కార్పొరేటర్ లను పార్టీ సీనియర్ నాయకులను సాధారణ ప్రజలను ఎక్కడికి అక్కడ అరెస్టు చేశారు.. ఇంత అరాచకంగా అక్రమంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారం శాస్వతంగా కాదని గుర్తుపెట్టుకోవాలి.. ఇప్పుడున్న పదవిలో ఎల్లకాలం కొనసాగరని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విూడియా సమావేశంలో ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాసయాదవ్, కాలె యాదయ్య, కెపి వివేకానంద, ఎమ్మెల్సీలు దేశపతి, వాణి తదితరులు పాల్గొన్నారు.
బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
సికింద్రాబాద్ చుట్టూ రాజకీయ రగడ రాజుకుంది. సికింద్రాబాద్కు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్కు మద్దతుగా ’సికింద్రాబాద్ బచావో’ పేరుతో ర్యాలీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోగా, ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జాయింట్ సీపీ హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విూడియాతో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్కు ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తొలగించే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. సికింద్రాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉండాలని, దాన్ని కాపాడేందుకే బీఆర్ఎస్ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలని, సికింద్రాబాద్ అస్తిత్వ పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.


