రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చేందుకు కృషి

హైదరాబాద్‌: సామాజిక రుగ్మతలను రూపుమాపి సమాన అవకాశాల కోసం రజకులు ముందుకెళ్లాలని రాజ్యసభ సభ్యుడు రాపోలు అనంద్‌భాస్కర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్ర రజక సంక్షేమ సంస్థ హైదరాబాద్‌ జషీరాబాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన రజక చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. రజకులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చర్చాలన్న ప్రధాన డిమాండ్‌పై తన వంతు కృషి చేస్తానని ఆనంద్‌ భాస్కర్‌ హామీ ఇచ్చారు.