రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు ప్రారంభం
హైదరాబాద్ : రాష్ట్రస్థాయి అంధుల క్రికెట్ పోటీలు ఈరోజు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజల పాటు కొనసాగే ఈ పోటీల్లో అన్ని జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. గెలుపొందిన జట్లకు శుక్రవారం సాయంత్రం బహుమతుల ప్రదానం జరుగుతుందని చెప్పారు.