రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేసిన పట్టాభి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో మాజీ న్యాయమూర్తి పట్టాభి రామారావు రెండోసారి బెయిల్‌ పిటిషన్‌ దాఖలుచేశారు. ఇదే కేసులో సోమశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్యే సురేశ్‌బాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను ఏసీబీ కోర్టు ఆగస్టు ఒకటో తేదీకి వాయిదా వేసింది.