వినోదపుపన్ను రాయితీ ఇవ్వాలి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు వినోదపు పన్ను రాయితీ కల్పించాలని కోరుతూ సినీ నిర్మాతలు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కోరారు. చిరంజీవి నేతృత్వంలో నిర్మాణతలు డి.సురేష్‌బాబు, అల్లు అరవింద్‌, కేఎస్‌ రామారావు, కళ్యాణ్‌, అశోక్‌కుమార్‌ తదితరులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో అత్యధికంగా 145శాతం వ్యాట్‌ వసూలు చేయడాన్ని వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. వినోదపుపన్నుతో పాటు వ్యాట్‌ చెల్లిస్తోంది. మన రాష్ట్రంలోనేని వారు తెలిపారు. తమ విజ్ఞప్తిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చేవరకు ఈనెల 5వ తేదిన ప్రతిపాదించిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత సురేష్‌బాబు వెల్లడించారు.