అంగన్వాడి సెంటర్ కు ప్రహరీ నిర్మించండి

అశ్వరావుపేట, సెప్టెంబర్ 5( జనం సాక్షి ) తిరుమల కుంట అంగన్వాడి 2 సెంటర్ కు ప్రహరి గోడ నిర్మించాలని కోరుతూ తల్లులు వినతి పత్రాన్ని సర్పంచ్ సున్నం సరస్వతి, కార్యదర్శి అనూష కు అందజేశారు. మండలంలోని తిరుమల కుంట పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామాల్లోని సమస్యలను ప్రజలు విన్నవించుకున్నారు. తిరుమల కుంట అంగన్వాడి 2 సెంటరులో ప్రహరీ గోడ లేక పిల్లలుకు ఇబ్బందికరంగా ఉందని, చెరువు ఇటు రహదారి అంగన్వాడి సెంటర్ ఉండటంతో పిల్లలకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని సర్పంచ్ సరస్వతికి పిల్లల తల్లులు తెలియజేశారు. వెంటనే ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. దానికి స్పందించిన సర్పంచ్ త్వరలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రహరీ కూడా నిర్మించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జుజ్జూరు రాంబాబు, కార్యదర్శి అనూష, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, బొల్లుకొండ చెన్నారావు సున్నం రామ లక్ష్మయ్య, ఎంపీటీసీ నాగలక్ష్మి, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.