బీసీ రిజర్వేషన్లను బీజేపీ నీరుగార్చే యత్నం
` తెలంగాణలో జరిగిన కులగణనపై దేశవ్యాప్తంగా చర్చ
` బీసీల వ్యతిరేక పార్టీ బీజేపీ.. అభ్యంతరాలను అసెంబ్లీలో లెవనెత్తాల్సింది
` రాష్ట్రంలో భాజపా బతికేందుకు ఎంఐఎం జపం చేస్తోంది : మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ (జనంసాక్షి) : ఢల్లీలోి అఖిల భారత నాయకత్వంతో కీలక సమావేశాలు జరిగాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం ఖర్గే నివాసంలో తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగిందని, భారత్ జోడో యాత్రలో అసమానతలు గమనించి కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని కేంద్రంలో అధికారంలోకి రాకపోయినా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కుల గణన చేసిందని అన్నారు. 56 ప్రశ్నలతో 150 ఇండ్లను ఒక బ్లాక్గా చేసి, శాస్త్రీయ బద్దంగా కులగణన చేశామన్నారు. సర్వేలో మూడున్నర కోట్ల ప్రజలు స్వచ్ఛందంగా తమ సమాచారం ఇచ్చారని, బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును గవర్నర్కు పంపించామని తెలిపారు. రాష్ట్రపతి వద్ద పెండిరగ్లో ఉందన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కాంగ్రెస్ ఆలోచిస్తుందని, తెలంగాణ భవిష్యత్ నిర్మాణానికి అద్భుతమైన సర్వేను సిద్ధం చేశారనీ అగ్రనాయకులు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.బీజేపీ అభ్యంతరాలు చెప్పాలనుకుంటే అసెంబ్లీలోనే లెవనెత్తాల్సిందన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే బీజేపీ నేతలు భయపడుతున్నారని మంత్రి పొన్నం ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి జాగ్రత్త.. ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ బీసీకి అవకాశం ఇవ్వలేదని, బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయ్యారని గుర్తుచేశారు. తెలంగాణలో కమలం పార్టీ గెలిచే అవకాశం లేదన్నారు. బీఆర్ఎస్తో కుమ్మక్కై రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ముస్లీంల రిజర్వేషన్లు గురించి బీజేపీ మాట్లాడుతుందని, ముందు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లీం రిజర్వేషన్లు తొలగించండి అని సవాల్ విసిరారు. బీజేపీ బీసీ రిజర్వేషన్లను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమయ్యే రిజర్వేషన్లు.. చట్ట సభల వరకు పోతాయన్నారు. బీజేపీ బీసీలకు వ్యతిరేకం, వారిపై తిరుగుబాటు తప్పదన్నారు. తెలంగాణలో బీజేపీ బ్రతకడానికి ఎంఐఎం జపం చేస్తుందని, ఎంఐఎం, బీజేపీ జపం చేస్తుందని పొన్న ప్రభాకర్ విమర్శించారు.