అంగన్వాడి సేవలు వినియోగించుకోవాలి..

శంకరపట్నం జనం సాక్షి సెప్టెంబర్ 24
మహిళ,శిశు సంక్షేమ శాఖ అంగన్వాడి సేవలను అర్హులు వినియోగించుకోవాలని ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రం టీచర్లు కాటం రాజమణి, గాజుల కాంతా కోరారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండలంలోని కన్నాపూర్ గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులకు హ్యాండ్ వాష్ పోషక ఆహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.