మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు..

` కర్ణాటక కీలక నిర్ణయం
బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ, బహుళజాతి సంస్థలు, ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడిరచింది.‘‘శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నాం’’ అని క్యాబినెట్‌ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడిరచారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని హర్షం వ్యక్తంచేశారు. అయితే అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ఇప్పటికే బిహార్‌, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో, స్విగ్గీ, ఎల్‌ అండ్‌ టీ, గోజూప్‌ వంటి సంస్థలు వేతనంతో కూడిన ఈ సెలవును ఇస్తున్నాయి.