అక్రమ సంబంధం కోసం కన్నకొడుకును చంపుకున్న తల్లి

యూపిలో ఆలస్యంగా వెలుగు చూసిన దారుణం
పోలీసుల అదుపులో తల్లీ, హంతక ముఠా
లక్నో,మే30(జ‌నం సాక్షి):  తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఓ తల్లి.. చెట్టంత ఎదిగిన కన్న కొడుకును కడతేర్చింది. ఈ దారుణ ఘటన యూపీలోని టీపీ నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మే 20న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 40 ఏళ్ల ఉషా పర్షార్‌.. నౌషద్‌ అనే వ్యక్తితో గత కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇలాంటి పనులు మానుకోవాలని తల్లిని కుమారుడు ముఖేష్‌ పర్షార్‌(28) పలుసార్లు హెచ్చరించాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న ముఖేష్‌ను ఎలాగైనా వదిలించుకోవాలని ఉషా పర్షార్‌ ఎ/-లాన్‌ చేసింది. ప్రియుడు నౌషద్‌, కాంట్రాక్ట్‌ కిల్లర్‌ బిలాల్‌తో కలిసి ఈ నెల 20న ముఖేష్‌ను హత్య చేయించింది. 21న పోలీసులకు ముఖేష్‌ డెడ్‌బాడీ లభించింది. అయితే ఈ కేసులో తల్లి ఉషా పర్షార్‌ను పోలీసులు విచారించగా వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. తన కుమారుడిని బయటి వ్యక్తులు చంపి ఉంటారని చెప్పింది. మొత్తానికి చేసిన నేరాన్ని ఉషా పర్షార్‌ అంగీకరించింది. గతంలోనే మత్తు పానీయాలు ఇచ్చి ముఖేష్‌ను చంపేందుకు కుట్ర చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముఖేష్‌ను హత్య చేసి ఉషా, నౌషద్‌తో పాటు బిలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నౌషద్‌పై పదుల సంఖ్యలో దొంగతనం, చైన్‌స్నాచింగ్‌ కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.