డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):డిఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఏం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డీఎస్సీ – 2014 ఎంపికైన మొత్తం 11,062 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్న సందర్భాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి ఎంపికైన మొత్తం 212 మంది అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోడానికి 5 ప్రత్యేక బస్సుల్లో భూపాలపల్లి నుండి హైదరాబాద్ బయల్దేరి వెళ్తున్న అభ్యర్థులకు బుధవారం బెస్ట్ విషెష్ చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు ప్రధాన రహదారి మధ్యలో ఎమ్మెల్యే చేతుల మీదుగా మొక్కలు నాటారు. మొక్కల పెంపకం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డీఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు.