అజయ్ అన్న సేవాదళం అధ్వర్యంలో కేజివిబి స్కూల్ కు వాటర్ పంప్ వితరణ

గద్వాల నడిగడ్డ సెప్టెంబర్ 18 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కె జి వి బి స్కూల్ నందు విద్యార్థినులకు గతంలో వాటర్ పంప్ కలిపోయిందని స్కూల్ ప్రిన్సిపల్ పద్మావతి, ఉపాధ్యాయులు అజయ్ అన్న సేవా దళం దృష్టికి తీసుకురాగా ఆయన ఆధ్వర్యంలో వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశాపోగు రాజు సహాయంతో 19,000/- వేల రూపాయలతో నూతన వాటర్ పంప్ ను డా.వి.యం.అజయ్ చేతుల మీదుగా ఆదివారం అందచేశారు.స్కూల్ బిల్డింగుకు 3 ఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలని, బాత్రూం లకు డోర్ల్ సరిగా లేవని, కాంపౌండ్ వాలుకు మెయిన్ గేట్ కావాలని ప్రిన్సిపాల్ పద్మావతి వారి దృష్టికి తెచ్చారు. స్పందించిన డా.అజయ్ మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం దృష్టికి తీసుకెళ్లి సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు.అజయ్ అన్న సేవా దళం తరుపున మీకూ ఎప్పుడు ఎలాంటి సమస్యా వచ్చిన మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్ డి ఎస్ చైర్మెన్ సీతారాం రెడ్డి,వడ్డేపల్లి జెడ్పీటీసీ కాశాపోగు రాజు,మున్సిపల్ చైర్ పర్సన్ కరుణ,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్,ఉండవల్లి మండల అధ్యక్షుడు రమణ,ప్రిన్సిపల్ పద్మావతి,
ఉప సర్పంచ్ మహేష్ నాయుడు,బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్,జిల్లా సమన్వయ కర్త నరేంద్ర వర్మ,రాజేష్ ముదిరాజ్,
ఇమ్మానియేల్,రాకేష్ రెడ్డి, వడ్డేపల్లి సోషల్ మీడియా కన్వీనర్ ప్రకాష్,శివ స్కూల్ ఉపాధ్యాయులు, అజయ్ అన్న సేవా దళం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.