అణు పరీక్షలకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా

సియోల్‌, జనంసాక్షి: ఉత్తర, దక్షిణ కొరియాల్లో యుద్ధవాతావరణం కొనసాగుతోంది. తాజాగా ఉత్తర కొరియా అణు పరీక్షలకు సిద్దమవుతోంది. దక్షిణ కొరియా వెల్లడించింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతంలోని పంగ్‌యేరి ప్రాంతంలో ఇందుకు సంబందించిన యత్నాలు జరుగుతున్నట్లు దక్షిణ కొరియా ప్రతినిధి వెల్లడించారు. ఫిబ్రవరి 12న ఉత్తర కొరియా మూడోసారి అణుపరీక్షలు నిర్వహించి పలు దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.