అధికారులు హాజరు కాలేదని సివిల్ రైట్స్ డే. బై కాట్

జనం సాక్షి, శంకరపట్నం,మండల స్థాయి అధికారులు హాజరు కాలేదని ముత్తారం గ్రామంలో మంగళవారం పౌరహక్కుల దినోత్సవ వేడుకలను బైకాట్ చేసినట్టు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కనకం శంకర్ తెలిపారు. ప్రతినెల పౌర హక్కుల దినోత్సవ వేడుకలకు మండల స్థాయి అధికారులు హాజరు కావాల్సి ఉండగా తాసిల్దార్, ఎంపీడీవో,ఎంఈఓ,ఏవో,వైద్యాధికారి, ఏ పీ ఎం, ఏ పీ ఓ, ఎస్ ఐ హాజరు కావడం లేదని ఆయన ఆరోపించారు. గంటసేపు అధికారుల కొరకు వేచి చూశామని కేవలం డిప్యూటీ తాసిల్దారు శ్రీకాంత్ హాజరైనారు అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మెరుగు శీను, ఉప సర్పంచ్ బొల్లం రాజయ్య, ఆడెపు నర్సయ్య, ఆడెపు ఓదెలు, కనకం సంపత్, రాజయ్య దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు