అఫ్గాన్‌ ఇచ్చిన మాట తప్పింది


అఖిలపక్షంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌
న్యూఢల్లీి,ఆగస్ట్‌26(జనంసాక్షి): ఆఫ్ఘన్‌లో ప్రస్తుతం సంక్షోభం చాలా తీవ్రంగా ఉన్నదని, సాధ్యమైనంత ఎక్కువ మందిని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నిస్తున్నామని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, భారత ప్రభుత్వం చేపడుతున్న తరలింపు చర్యలపై కేంద్రమంత్రి జైశంకర్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితిపై వివిధ పార్టీల నేతలకు ఆయన వివరించారు. బుధవారం 35 మందిని ఇండియాకు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ఖతార్‌ రాజధాని దోహాలో జరిగిన శాంతి ఒప్పందంలో తాలిబన్లు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఈ సందర్భంగా జైశంకర్‌ అన్నారు. వారు చెప్పినట్లుగా అక్కడ పరిస్థితులు లేవన్నారు.