అభివృద్దిలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్.. -ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ది.. – పట్టణ ప్రగతి తో వేగంగా అభివృద్ది.. -ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. వరంగల్ ఈస్ట్, జూన్ 10(జనం సాక్షి):

ముఖ్యమంత్రి కేసీఆర్  నాయకత్వంలో తెలంగాణ అద్బుతంగా అభివృద్ది చెందుతుందని  వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.. వరంగల్ 19 వ డివిజన్ కాశిబుగ్గలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో బాగంగా కార్పోరేటర్ ఓని  భాస్కర్ తో కలిసి డివిజన్ లో పలు కాలనీలను ఆయన సందర్శించారు..ప్రజావినతులను స్వీకరించారు.కాలనీలలో అభివృద్ది కమిటీలను ఏర్పాటు చేసారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్బుతంగా అభివృద్ది చెందుతుందన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో,మంత్రి కే.టీ.ఆర్ నేతృత్వంలో రాష్ట్రం,నియోజకవర్గం ప్రగతి బాటన పయనిస్తుందన్నారు..ముఖ్యమంత్రి కేసీఆర్  పట్టణాలను మరింత వేగంగా అభివృద్ది చేసేందుకు ఈ పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు..తమ వీదులు,తమ డివిజన్ల అభివృద్ది ప్రజలు,అదికారులు,ప్రజాప్రతినిదులు కంకణబద్దులై పనిచేయాలని,ప్రజా బాగస్వామ్యంతోనే అభివృద్ది సాద్యమవుతుందన్నారు..రానున్న వర్షాకాలం నేపద్యంలో సీజనల్ వ్యాదుల బారిన పడకుండా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అదికారులు,సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు..ఆరోగ్యవంతమైన నగరంగా ఈ నగరాన్ని,ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలన్నారు..నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నామని,పట్టణ ప్రగతి లో బాగంగా సమస్యలన్నీటిని పరిష్కరిస్తామన్నారు..
ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు,అదికారులు,కార్యకర్తలు పాల్గొన్నారు..