అభివృద్ధి ప్రధాత పైలట్ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించండి.

బీఆర్ఎస్ యువ మైవార్టీ నాయకులు.
తాండూర్ నవంబర్ 13( జనంసాక్షి) అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇంద్రానగర్ బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం నివాసంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ధ్యేయంగా తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఐదేళ్లు తన పాలనను కొనసాగించారని అన్నారు. గత 30 సంవత్సరాలుగా ఎన్నడూ జరిగిన విధంగా 1600 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఘనత ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ఎక్కడ చూసినా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేసిన అభివృద్దే కనిపిస్తుందని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమని దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన మేనిఫెస్టోలో పేదలకు 400 గ్యాస్ సిలిండర్ సన్న బియ్యం వికలాంగులకు 5 వేల పెన్షన్ వృద్ధులకు 6 వేలు వరకు పెన్షన్ 15 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు. తాండూర్ లో పిలిస్తే పలికే నేత ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసే పైలెట్ రోహిత్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మహమ్మద్ అక్రమ్ ,సయ్యద్ సిరాజ్ ,తన్వీర్ ఖాన్ ,అబ్దుల్ అమీద్ ,మహమ్మద్ యూనుస్, అహమద్ లు పాల్గొన్నారు.