అమరుల ఆశయ సాధనకై ముందుకు సాగాలి –సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు డి. ప్రసాద్ పిలుపు

టేకులపల్లి, నవంబర్ 8( జనం సాక్షి ): అమరవీరులు చూపిన ఆశయ బాటలో ముందుకు సాగాలని అదే వారికిచ్చే ఘనమైన నివాళి అని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా పార్టీ జిల్లా నాయకులు డి. ప్రసాద్ అన్నారు. మంగళవారం తుమ్మల చెలక,ఆంజనేయపాలెంలలో అమరవీరుల సంస్మరణ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి,భుక్తి, పేద ప్రజల విముక్తి కోసం, పేదల రాజ్యం రావాలని, సమ సమాజ స్థాపన జరగాలని చారు మజుందార్,సి పి, రాయల సుభాష్ చంద్రబోస్,డివి కృష్ణ, నీలం రామచంద్రయ్య, లింగన్న, దొరన్న, ధర్మన్న,శాంతక్క లలితక్క, కాచినపల్లి అమరవీరులు,కాంపాటి చంద్రం, పగడాల వెంకన్న, ముష్మి అమరవీరులు మురళి వంటి ఎందరో అమర వీరులు తమ ఉన్నతమైన జీవితాలను త్యాగం చేసి పేద ప్రజల కొరకు తమ ప్రాణాలను అర్పించారని ఆయన అన్నారు. వారు వేసిన ఉద్యమదారుల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా, అమరుల ఆశయ సాధనకై ముందుకు సాగాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )ప్రజాపంథా నాయకులు లత,కమిలి,శేషు, గన్ను, పంతులు, భద్రం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.