అయిజ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

అయిజ, జులై 23 (జనం సాక్షి):
అయిజ పట్టణం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎస్. రామచంద్రరెడ్డి మాట్లాడుతూ.ఐజ మండలంలో 12 ప్రభుత్వ పాఠశాలలు మరియు 10 ప్రైవేట్ పాఠశాలలు ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు నాలుగు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి అలాగే అయిజ చుట్టుపక్కల మండలాలైన మల్దకల్, గట్టు, ఇటిక్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల లు మరియు ప్రభుత్వ పాఠశాలలో వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఒక అయిజ మండలంలోని ఇంటర్ పాసై ఉన్నత తరగతుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేవాళ్లు 1000 మంది పైగా ఉన్నారు.జిల్లాలోని జిల్లా కేంద్రం గద్వాల తర్వాత అతిపెద్ద పట్టణమైన ఐజ పట్టణంలో సుమారు 40 వేల జనాభాకు పైగా ఉన్న ఇంతవరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం శోచనీయం. కావున వెంటనే ఐజా పట్టణానికి వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం 3 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు  తక్షణమే స్పందించి  కళాశాల ఏర్పాటుకు చొరవ చూపాలి లేని పక్షంలో అఖిలపక్ష నాయకులతో, అన్ని విద్యార్థుల సంఘాల తో తదుపరి కార్యచరణ ప్రకటిస్తాం.ఈ కార్యక్రమంలోబిజెపి ఐజ పట్టణ అధ్యక్షుడు నరసింహ శెట్టి, ఐజ మండల అధ్యక్షుడు శేఖర్,గట్టు మండల అధ్యక్షుడు శివారెడ్డి, జిల్లా బిజెవైఎం ప్రధాన కార్యదర్శి  గోసాయి హరి, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు వెంకటేష్  యాదవ్,ఐజ  పట్టణ ప్రదానకార్యదర్శి ప్రదీప్,పట్టణ బిజెవైఎం అధ్యక్షుడు అంజి, పట్టణ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షరీఫ్, బిజెవైఎం ప్రధాన కార్యదర్శి పరుశురాం ,తదితరులు ఉన్నారు.
Attachments area