అయ్యో బర్రెలక్క!

సోషల్‌ మీడియా నుంచి రాజకీయాల్లోకొచ్చి నిరుద్యోగుల పాలిట నిలబడిన బర్రెలక్క అలియాస్‌ శీరిష వెనుకంజలో ఉన్నారు. అత్యల్పంగా 983తో వెనుకంజలో ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క (శిరీష) అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. శిరీషకు పలువురు ప్రముఖులు మద్ధతు పలికారు. ఇతర నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఆమెకు మద్ధతు తెలుపుతూ ప్రచారంలో పాల్గొన్నారు. మద్యాహ్నం 12 గంటల సమయానికి బర్రెలక్కకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా!

తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌లో బర్రెలక్క ముందజంలో నిలిచారు. దీంతో నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు స్పష్టమైంది. అయితే ఈవీఎమ్‌లలో మాత్రం బర్రెలక్క వెనకపడిరది. పోస్టల్‌ బ్యాలెట్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కంటే ముందు వరుసలో నిలిచిన శిరీష ఈవీఎమ్‌ ఓట్లలో వెనుకంజ వేసింది. విజిల్‌ గుర్తుతో ఎన్నికలో బరిలో నిలిచిన శిరీషకు తొలి రౌండ్‌లో 473 ఓట్లు రాగా రెండో రౌండ్‌లో 262 ఓట్లు వచ్చాయి. దీంతో శిరీషకు మొత్తం 735 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక కొల్లాపూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి జూపల్లి కృష్ణరావు 9,797 ఓట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. దీంతో బర్రెలక్క వెయ్యి లోపు ఓట్లకు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మ్యాజిక్‌ ఫిగర్‌ను టచ్‌ చేసే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే సుమారు 66 స్థానాల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజారిటీ కొనసాగుతోంది. దీంతో ఇక తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ పాలనేనని అర్థమవుతోంది. ఈ క్రమంలోనే ఈసారి ఎన్నికల్లో పలు స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఇలాంటి స్థానాల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం ఒకటి.