అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు

జహీరాబాద్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి) అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు అని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం యూ ఎస్ పి ఎస్ ఆధ్వర్యం లో చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్తున్న ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు రామ్ చందర్ భీమ్ వంశీ,,జిల్లా కార్యదర్శి ఆర్ .నర్సింహులు, ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి వై. అమృత్ లను జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల కు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.