అర్చక పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఆలయ కార్యనిర్వహణాధికారి పురేందర్*

అలంపూర్ జనం సాక్షి (సెప్టెంబర్ 13 ) అలంపూర్ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కార్యనిర్వహణాధికారి పురేందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందులో నాలుగు అర్చకులు, మూడు పరిచారకులు, ఒక డోలు పోస్టు ఉన్నాయని తెలిపారు. అర్చకులకు అర్చక ప్రవేశ పరీక్ష పాస్ అయి ఉండాలని, పరిచారకులు సాంప్రదాయ వంటకాలలో నైపుణ్యం కలిగి ఉండాలని, డోలు కొట్టేందుకు గుర్తింపు పొందిన సంగీత కళాశాల నుండి ధ్రువ పత్రం ఉండాలన్నారు. ఈ అర్హత కలిగిన వారు ఈ నెల 26 లోపల దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.