*అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలి

   సిఐటియూ జిల్లా నాయకులు నరసింహ*
*అలంపూర్ జులై 28 (జనం సాక్షి)*
రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలలో అర్హత కలిగిన వారికి ప్రమోన్లు కల్పించాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బి.నరసింహ అన్నారు. గురువారం  అలంపూర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం దగ్గర 4వ రోజు సమ్మె చేస్తున వి అర్ ఏ లు చెవిలో పూలు పెట్టుకొని నిరసన తెలిపారని అన్నారు. వీఆర్ఏలకు సిఐటియు నాయకులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు నరసింహ మాట్లాడుతూ విఆర్ఎలు చేస్తున్న  డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.వారికి  పెస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.55 సవత్సరాలు పైబడిన వి అర్ ఏ ల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని,పెన్షన్ సౌకర్యం కల్పించాలని అన్నారు.ప్రస్తుతం వారికి ప్రభుత్వము డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం చాలీచాలని వేతనాలు ఇచ్చి వారితో చెలగాటం ఆడుతూ  వెట్టి చాకిరి చేయిస్తుందని  అన్నారు.వేతన సవరణ చట్టం ప్రకారం పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.చనిపోయిన వారికి ప్రమాద బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేని ఎడల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వి అర్ ఏ లు తమ సత్తా చూపిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో అలంపూర్ మండల వి అర్ ఏ లు పాల్గొన్నారు.
Attachments area