అసత్య ఆరోపణలు, చిన్న పిల్లలతో రాజకీయాలు దిగజారుడుతనానికి నిదర్శనం..!

జనంసాక్షి , రామగిరి, అక్టోబర్ 28 :
ఈనెల 26న అడవి ముత్తారం మండలంలో జరిగిన బి.ఆర్.ఎస్ కార్యకర్తల సమావేశంలో మంథని బీ.ఆర్.ఎస్ అభ్యర్థి పుట్ట మధుకర్ తమ నాయకుడు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మీద తప్పుడు నేరారోపణ చేస్తూ, కులాన్ని ఉద్దేశించి పాట పాడించడం, అదికూడా అభం శుభం తెలియని పసిపిల్లతో పాట రూపంలో పాడించడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్ అన్నారు. సెంటినరీ కాలనీ లోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పసి హృదయాలలో విజభీజాలను నాటడం, సమాజాన్ని కులం పేరుతొ విభజించే కుట్రలు చేయడం, సాక్షాలు లేని కారణంగా ఎప్పుడో క్లోస్ అయిపోయిన కేసును ఉటంకిస్తూ పాటలు పాడించడం సరికాదన్నారు. అలాగే ఈ క్రమంలో మొన్న అడవిముత్తారంలో పాడించిన పాట మీద పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రొడ్డ బాపు, ఐఎన్ టియుసి నాయకులు కోట రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ తీగల సమ్మయ్య ఎంపీటీసీలు చిందం మహేష్ , కొప్పుల గణపతి, నాయకులు బర్ల శ్రీనివాస్, ముస్త్యాల శ్రీనివాస్, బండారి సదానందం, బోగె లింగయ్య, కాటం సత్యం, ఉడుత శంకర్ కండె పోషం తదితరులు పాల్గొన్నారు.