ఆందోళనలతో దద్దరిల్లిన దేశ రాజధాని

న్యూఢీల్లీ, జనంసాక్షి : చిన్నారి అత్యాచార ఘటనపై ఢీల్లీ ప్రజల తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనను నిరసిస్తూ వరుసగా రెండోరోజు కూడా ఆందోళనలను చేపటంటడంతో రాజధాని దద్దరిల్లిపోయింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి  వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా నిందితుడు మనోజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి ఈ రోజు ఉదయం కోర్టులో హాజరు పరిచారు.