ఆకస్మికంగా రాజాపూర్ గ్రామంలో ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన కోడేరు ఏ ఓ శ్రీరాములు.

కోడేరు జనం సాక్షి సెప్టెంబర్ 23 కోడేరు మండల పరిధిలోని రాజాపూర్ గ్రామంలో కోడేరు వ్యవసాయ అధికారులు ఏవో శ్రీరాములు ఏఈఓ మధుసూదన్ రెడ్డి లు ఆకస్మికంగా రాజాపూర్ గ్రామంలోని పార్టీ లేజర్ షాపులు శుక్రవారం రోజు తనిఖీ చేయడం జరిగింది. ఐపీఎల్ 20,20, 0-13, మరియు ఫర్టిలైజర్ స్ షాప్ లో ఉన్న పలు రకాల వ్యవసాయ ఎరువులను రాజాపూర్ గ్రామంలోని స్థానిక పలువురు రైతుల ముందు తనిఖీ చేసి శాంపిల్స్ గా కొన్ని రకాల ఎరువులను తీసుకోవడం జరిగింది. శాంపిల్ గా తీసుకున్న ఎరువులను ల్యాబ్కు పంపిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని ఏవో శ్రీరాములు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏవో శ్రీరాములు ఏఈఓ మధుసూదన్ రెడ్డి షాపులో ఓనర్లు కే రాజా శెట్టి పి కురుమూర్తి రైతులు తదితరులు ఉన్నారు.