ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మైల్ స్టోన్ యూత్ స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు

ముఖ్యఅతిథిగా ఏఎస్పీ రామేశ్వర్

 

నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు 14(జనంసాక్షి)

ఆదివారం నాడు ఏర్పాటు చేసినటువంటి స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఏఎస్పీ రామేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేయడం జరిగింది.స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన రక్త దాన శిబిరంలో యువకులు స్వచ్ఛందంగా పాల్గొని 75యూనిట్లును రక్తదానం చేయడం ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో యువకులతోపాటు కాలనీ వాసులు ఆర్గనైజ్డ్ కమిటీ మరియు పాలమూరు బ్లడ్ బ్యాంక్ వారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.