ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

ఒంగోలులో 3కె రన్‌ లో పాల్గొన్న కలెక్టర్‌
ఒంఓగలు,అగస్టు2(జ‌నంసాక్షి): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో 3 కే రన్‌ నిర్వహించారు. కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌తో కలిసి స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు మేయర్‌ సుజాత.. ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగులో పెద్ద సంఖ్యలో పాఠశాల విద్యార్థులు, యువజన సంఘాల ప్రతినిధులు, సంఘసేవకులు పాల్గొని విజయవంతం చేశారు. స్వాతంత్య పోరాటాన్ని ప్రజలు స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి సహకరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ఏఎస్‌ దినేష్‌ కుమార్‌ సూచించారు. 75 ఏండ్లలో దేశం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఈ నెల 15 వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములై తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని మేయర్‌ గంగాడ సుజాత కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి పులి శ్రీనివాసులు, ఏఎస్పీ నాగేశ్వరరావు, సీపీఓ వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.