ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌

రామకృష్ణా బీచ్‌లో ర్యాలీ
విశాఖపట్టణం,అగస్టు2(జనంసాక్షి): అజాది కా అమృత్‌ మహౌత్సవ్‌, హర్‌ షుర్‌ తిరంగ కార్యక్రమంలో భాగంగా …జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం ఉదయం 6 గంటలకు రామకృష్ణా బీచ్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి , మున్సిపల్‌ కమిషనర్‌ లక్ష్మీ షా, పోలీస్‌ కమిషనర్‌ సిహెచ్‌.శ్రీకాంత్‌, జిల్లా అధికారులు, నగర పౌరులు, విద్యార్ధులు పాల్గొన్నారు. ముందుగా రామకృష్ణ బీచ్‌ నుండి ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పోర్ట్స్‌ ఆక్వా కాంప్లెక్స్‌ వద్ద నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.