ఆజాద్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌: నగరానికి వచ్చిన రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌కు కాంగ్రెస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. ఆదివారం ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్‌ పార్టీ విసృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గోంటారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆజాద్‌కు మంత్రి నాగేందర్‌, సుబ్బిరామిరెడ్డి, హనుమంతరావు, మల్లురవి.. తదితరులు స్వాగతం పలికారు.