ఆదిదేవ ఆధ్వర్యంలో శ్రీ సూక్త హవనం హోమం..

కేసముద్రం సెప్టెంబర్ 4 జనం సాక్షి /స్థానిక రైల్వే స్టేషన్ ఆవరణలో ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్, రైల్వే ఎంప్లాయిస్, గణేష్ ఉత్సవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద ఆదివారం శ్రీ సూక్త హవనం హోమం నిర్వహించారు.ఈ హోమాన్ని మరింగంటి లక్ష్మీనరసింహాచార్యులు,
తిరునగరి నిఖిల్ చార్యుల వేదమంత్రోచ్చారణలతో నిర్వహించారు. హోమంలో తేరాల శ్రీనివాస్-రమాదేవి, వోలం సతీశ్-సమత, రావుల మురళి-లక్ష్మి, లెంకలపెల్లి శంకర్-చందన దంపతులతో పాటు వేములపల్లి హేమంత్, శ్రీరాం హరీష్, వేమిశెట్టి శశి కూర్చొన్నారు. కార్యక్రమానికి భక్తులు, మహిళలు, ఆదిదేవ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరయ్యారు.అనంతరం వోలం రాజేశ్వరరావు, వెలిశాల రాజేశ్వర్ రావు సహకారంతో నిత్యాన్నదానం నిర్వహించారు.