ఆదిభట్ల మున్సిపాలిటీలో పర్యటించిన కేంద్ర అమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి దేవిసేన్ చవాన్

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి):-
పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా 3వ రోజు రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో  కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి భవనగిరి పార్లమెంట్ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి  దేవిసేన్ చవాన్ పర్యటించారు ఈ సందర్భంగా బొంగులూరు గేట్  పి ఎస్ జి కన్వెన్షన్ హాల్  లో  కార్యకర్తల తో సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం
మున్సిపల్ పరిధిలోని  ఎంపీ పటేల్ గూడా గ్రామంలో ఆది బట్ల మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యదర్శి పొట్టి రాములు తో కలసి రేషన్ షాపును సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన
మీడియా సమావేశం లో  కేంద్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  పూర్తిగా అప్పుల కుప్పలు చేసి కేంద్ర పథకాలను తప్పుదారి పట్టిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని  ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి ఎంతో ఎదుగుతుందని ప్రజల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్కా నరసింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యులు బోసు పెళ్లి ప్రతాప్, జిల్లా నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి లచ్చిరెడ్డి, అర్జున్ రెడ్డి,  వీరస్వామి గౌడ్ శ్రీశైలం నరసింహారెడ్డి నరసింహ గౌడ్, సాధు, శ్రీనివాస్ ,శ్రీధర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు