ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం సహాయనిధి అండగా నిలిచింది..

-సీఎం సహాయనిధి  చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే…
గద్వాల రూరల్ సెప్టెంబరు 23 (జనంసాక్షి):- గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  మల్డకల్ మండలం పరిధిలో వివిధ  గ్రామాలలు సంబంధించిన        లబ్ధిదారులకు   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను        గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి చేతుల మీదుగా  దేవన్న చికిత్స నిమిత్తం 1లక్ష  రూపాయలు,గోపాల్   కు చికిత్స  నిమిత్తం 46500  చెక్కులను అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేద ప్రజలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగకరమైన పేద ప్రజలు వైద్యం కోసం ఖర్చు పెట్టిన డబ్బులను సీఎం సహాయ నిధి ద్వారా 50% డబ్బులను రూపంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది కరోనా కష్ట సమయంలో కూడా పేద ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.ఆరోగ్య పరిస్థితి బాలేక ఆసుపత్రి లో ఖర్చు పెట్టిన వాటికి సంబంధించిన బిల్లులను సీఎం గారి సహాయనిధి పంపితే  సీఎం సహాయం కింద నమోదు చేసుకున్న వారికి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా చెక్కుల  అందజేయడం జరిగినది అని తెలిపారు..ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటన్న , మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి , సర్పంచులు, ప్రతాప్, పురుషోత్తం రెడ్డి, తెరాస పార్టీ నాయకులు మధు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area