ఆమ్‌ఆద్మీ పార్టీలో మార్పులు

న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీలో రాజకీయ సంక్షోభం ముదురుతోంది. ఆప్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జాతీయ క్రమశిక్షణ సంఘం నుంచి ప్రశాంత్‌భూషణ్‌ను ఆప్ తొలగించింది. అంతర్గత లోక్‌పాల్ పదవి నుంచి అడ్మిరల్ రామ్‌దాస్‌కు ఆప్ ఉద్వాసన పలికింది. ముగ్గురు సభ్యులతో కూడిన కొత్త లోక్‌పాల్‌ను ఆప్ ఏర్పాటు చేసింది. ఆప్ జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌ను నిన్న తొలగించిన విషయం విదితమే.