ఆయుర్వేద వైద్య విద్యార్థుల నిరసన ర్యాలీ

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 31(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అనంత లక్ష్మి ఆయుర్వేదిక్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్లోనివెంకటరమణ కూడలి నుండి పోచమ్మ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కాలేజీలో మరియు హాస్పిటల్ కనీస వసతులు కల్పించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. స్టైఫండ్ వెంటనే విడుదల చేయాలని ,కాలేజీల్లో అధ్యాపకులతో పాటు వైద్య పరికరాలు అందించాలంటూ తమ అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే 2022-2023 ఆయుర్వేదిక్ ప్రవేశాలు కల్పించాలంటూ డిమాండ్ చేశారు. మహిళల వసతి గృహాల్లో 200 పడకలు పైగా సామర్థ్యం పెంచాలంటూ నినదించారు.