ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 25 : ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పెండ్రు రమా సురేష్ రెడ్డి అన్నారు. మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు మంథని మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభలో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారంటీ పథకాల గురించి శనివారం స్థానిక కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులతో కలిసి గడపగడపకు తిరుగుతూ వివరించారు. తెలంగాణ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ నాయకులు ఎల్లంకి రాధిక, లైసెట్టి రజిత, పద్మ, సుగుణ, హుస్సేన్, విజయ తోపాటు అధిక సంఖ్యలో మహిళ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.