ఆర్టీసీ బస్సు – డీసీఎం ఢీ..నలుగురు మృతి..

వరంగల్ : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్ తో పాటు ముగ్గురు ప్రయాణీకులు మృతి చెందారు. ఈ ఘటన రఘునాథ మండలం నిడిగొండ వద్ద చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయిన డీసీఎం వరంగల్ 2డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. దీనితో ఇద్దరు ప్రయాణీకులు అక్కడికక్కడనే మృతి చెందారు. మరో ప్రయాణీకురాలు, డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూ వారిద్దరూ మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న మృతుల బంధువుల రోదలనతో జనగాం ఏరియా ఆసుపత్రి మారుమోగుతోంది. ఈ ఘటనలో ఎనిమిది నుండి పది మంది వరకు గాయపడినట్లు సమాచారం. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు.