ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనం డీ ఇద్దరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 10 ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని డీ కొట్టిన సంఘటనలలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోకరికి తీవ్రగాయాలు ఘటన మండల పరిధిలోని ఎర్రవల్లి సమీపంలో గద్వాలకి వెళ్లే రహదారి నంది గోశాల దగ్గర శనివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్సై గోకారి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐజ మండలంలోని గుడిదొడ్డి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి, ఐజ మండల పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ప్రైవేట్ ఆస్పత్రి ఏఎన్ఎమ్ చంద్రకళ, వడ్డేపల్లి మండల పరిధిలోని తనగల గ్రామానికి చెందిన మంజుల ముగ్గురు ఎపి 21 ఎబి 2579 నెంబర్ గల ద్విచక్ర వాహనం పై గద్వాల నుండి ఎర్రవల్లి చౌరస్తా కు వెళ్తుండగా మార్గమధ్యంలో ఎర్రవల్లి చౌరస్తా సమీపంలో నంది గోశాల దగ్గర డీసీఎం క్రాస్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న టీఎస్33 టీడీ 0332 నెంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో మహేశ్వర్ రెడ్డి వయస్సు (28) చంద్రకళ వయస్సు (26) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. తీవ్ర గాయాలైన మంజులను చికిత్స నిమిత్త గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన మహేశ్వర్ రెడ్డి చంద్రకళ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రమాదం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.