ఆర్టీసీ సమ్మెను అణచివేసేందుకు టీ.సర్కారు యత్నం

 వరంగల్: ఆర్టీసీ సమ్మెను తెలంగాణ ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నం చేస్తోంది. వరంగల్ జిల్లాలో భారీగా మోహరించిన పోలీసులు.. సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద లాఠీలు ఝులిపించి.. బస్సులను నడిపించాలని వార్నింగ్ ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను కాదని పోలీసులు.. దగ్గరుండి ప్రయాణికులను బస్సెక్కిస్తున్నారు.