ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ని కలిసిన గుండాల ఎంపీటీసీ సంధాని –

పలు సమస్యలు పరిష్కరించాలని వినతి
గుండాల,సెప్టెంబర్19(జనంసాక్షి);గుండాల మండల సమస్యలపై సోమవారం హైదరాబాదులో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ని గుండాల ఎంపిటిసి ఎస్కే సందాని కలసి, గుండాల మండల సెంటర్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సౌకర్యం లేదని వివరించగా తాను వెంటనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆస్పత్రిలోని మెరుగైన సౌకర్యాల కోసం వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా గుండాల నుంచి పస్రా వరకు అస్తవ్యస్తగా ఉన్న రహదారిని మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అలాగే మండలంలోని పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి కి మండల ప్రజల తరఫున ఎంపీటీసీ సంధాని కృతజ్ఞతలు తెలియజేసారు.