ఆర్థిక సహాయం అందజేత

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన అక్షర ఫౌండేషన్ సభ్యులు , సామాజిక కార్యకర్త మాండన్ బాలాజీ కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అక్షర ఫౌండేషన్ చైర్మన్ యాస రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ సభ్యులు అందజేశారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాండన్ బాలాజీ  నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.అనంతరం రాంకుమార్ రెడ్డి మాట్లాడుతూ అక్షర ఫౌండేషన్ కార్యక్రమాలలో, వృద్ధులకు సహాయం చేయడంలో, సామాజిక అవగాహన కల్పించడంలో, క్రీడా సాంస్కృతిక సామాజిక కార్యక్రమాలలో బాలాజీ చురుకుగా పాల్గొనే వారని తెలిపారు.నిరంతరం అనాధలకు, వృద్దులకు, పేదలకు సహాయ సహకారాలు కోసం పరితపించేవారని గుర్తు చేశారు.బాలాజీ కుమార్తెల చదువుకు దాతలు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో అక్షర ఫౌండేషన్ అధ్యక్షులు ఉప్పు నాగయ్య , ప్రధాన కార్యదర్శి పాల్వాయి వెంకట్ , ఉపాధ్యక్షులు నరాల తిరుమల రెడ్డి , కందాల వెంకటరెడ్డి, ఏపూరి వెంకటేశ్వర్లు, రుద్రంగి కాళిదాసు, మడూరి హనుమాచారి , దాసరి సతీష్ , నెల్లుట్ల పాపయ్య , ధరావత్ లకుపతి , షేక్ యూసఫ్, దండ శంకర్ రెడ్డి, వీరాసింగ్ తదితరులు పాల్గొన్నారు.