ఆర్థిక సాయం అందించిన ఎస్సై రాజ్ కుమార్

పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): కల్తీ  దిలీప్ కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదం మరణించడం తో వారి  తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో   మణుగూరు ఎస్సై రాజ్ కుమార్  రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ మల్లంపల్లి ములుగు జిల్లా లోని కల్తీ వెంకన్న గౌరీదేవి దంపతులు కుమారుడైనా దిలీప్ ఈ నెల నాలుగో తేదీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న రాజ్ కుమార్ తమ వంతు సాయంగా రూ పది వేలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు.  ఈ కార్యక్రమంలో  ఎస్సై రాజకుమార్ తో పాటు మాజీ ఎంపీటీసీ బొచ్చు వెంకటేశ్వర్లు ఉన్నారు.