ఆర్ధిక సహాయం అందజేసిన మల్యాద్రి.

కోటగిరి సెప్టెంబర్ 23 జనం సాక్షి:-కోటగిరి మండలం కల్లూర్ గ్రామానికి చెందిన మైనారిటీ సోదరులైన ఎం.డి అమీన్ తల్లి రజియా సుల్తానా శుక్రవారం మరణించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న బాన్సువాడ నియోజక వర్గ బి.జె.పి పార్టీ ఇంచార్జీ మల్యాద్రి రెడ్డి వారి కుటుంబ సభ్యులకు రూ.5000 ఆర్ధిక సహాయం స్థానిక కార్యకర్తల సమక్షంలో అందజేశారు.ఈ ఆర్థిక సహాయం అందజేతలో మక్కయ్య, రాజు పటేల్, బాలకృష్ణ,బ్రహ్మరెడ్డి,ఇబ్రహీం,సాయిలు,విజయ్,తదితరులు పాల్గొన్నారు.