ఆర్.ఆర్ హాస్పిటల్ యందు మెగా ఉచిత వైద్య శిభిరం

హసన్ పర్తి జనంసాక్షి: హసన్ పర్తిలో ఆర్.ఆర్ హాస్పిటల్  నందు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
 గురుముర్తి శివకుమార్ 66 వ డివిజన్ కార్పొరేటర్  ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం రెడ్ క్రాస్ సంస్థ హన్మకొండ గారి ఆధ్వర్యంలో   25 మంది యువకులు రక్తదానం చేశారు, 45 మంది షుగర్ మరియు వివిధ రకాల వైద్య పరీక్షలు చేసుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ గురుముర్తి శివకుమార్  మాట్లాడుతూ హసన్ పర్తి మండల కేంద్రంలో ఇంత పెద్దగా హాస్పిటల్ ను ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందుబాటులో సేవ చేయడం హాస్పిటల్ యాజమాన్యం ను అభినందించారు.ఈలాంటి సేవలు మరింతగా అందించాలని పేర్కొన్నారు.
 డా. వంశీ  మాట్లాడుతూ హసన్ పర్తి నందు ఆర్. ఆర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడి నాయకులు మరియు ప్రజల సహకారంతో మరింత సేవలు అందిస్తామని పేర్కొన్నారు,హసన్ పర్తి మండల కేంద్రంలోని ఒక పెద్ద హాస్పిటల్ స్థాపించడం వలన మండలంలోని ప్రజలకు 24 గంటల వైద్య సౌకర్యం అందించడం జరుగుతుంది, హాస్పిటల్ నందు డెలివరీలు,స్త్రీల సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు అందించబడును,అధునాతనమైన ఆపరేషన్ సౌకర్యంతో పాటుగా ల్యాబ్ సౌకర్యాలు,అంబులెన్సు సౌకర్యం కల్పించామని హాసన్ పర్తి మరియు ఎల్కతుర్తి,కమలపూర్ మండలాల  నుండి ప్రజలు విచ్చేస్తున్నారని మంచి సహకారాన్ని అందిస్తున్న నాయకులకు మరియు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.
 ఈ కార్యక్రమంలో శ్రీమతి డా. ఆర్ ఎస్తేర్ రాణి , మేకల హరిశంకర్  బిజేపి నాయకులు,పాస్టర్ రత్నం , తాల్లా శ్యాం, ప్రణీథ్ తదితరులు పాల్గొన్నారు.