ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా ధర్మపురం శ్రీను నియామకం


కొండమల్లేపల్లి నవంబర్ 12 జనం సాక్షి న్యూస్ :
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చే స్థాపించబడిన ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ను గ్రామ గ్రామాన బలోపేతం చేసేందుకు నేడు నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలో ఐ.బీ వద్ద దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ గా పీఏ పల్లి గ్రామానికి చెందిన ధర్మపురం శ్రీనుని నియమిస్తు నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న రాష్ట్ర పాల్గొన్నారు మరియు నల్గొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు భిక్షపతి,
జిల్లా అడ్వైజర్ కంబాలపల్లి వెంకటయ్య , జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్ , దేవరకొండ మండల ప్రధాన కార్యదర్శి గార్లపాటి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.