ఆసరా, వికలాంగుల పెన్షన్లు వెంటనే విడుదల చేయాలి. – తెలంగాణ వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య.

జనగామ బ్యూరో (జనంసాక్షి ): ఆసరా అందక వికలాంగులు ఆడుతున్న గోస అంతా ఇంతా కాదని వికలాంగుల వేదిక అధ్యక్షుడు మేకల సమ్మయ్య అన్నారు. ఆసరా పెన్షన్ సమయానికి అందడం లేదని, సెప్టెంబర్ పెన్షన్ ఇప్పటివరకు పంపిణీకి నోసుకోలేదని, సకాలంలో నగదు అందాక లబ్ధిదారులు పంపిణీ బ్యాంకుల చుట్టూ రోజు ప్రదక్షణ లు చేస్తున్నారని, ప్రతి నెల మొదటి వారంలో పంపిణీ చేయాలని, వికలాంగులకు రూపాయలు 4016, వితంతు వృద్ధులు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు బాధితులకు 2016 రూపాయలు చొప్పున పంపిణీ చేస్తున్నారని, మున్సిపల్ పరిధిలో లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారని, సెప్టెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ ఇంతవరకు జమ కాలేదని, వెంటనే విడుదల చేయాలనీ కోరారు.