ఆ పోలీస్ స్టేషన్ కి వెళితే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే….

వెంకటాపూర్(రామప్ప),జూన్22(జనంసాక్షి):-
ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ అధికారుల రూటే సపరేటు పిటిషన్ ఇవ్వడం కోసం వెళ్తే గంటల తరబడి వేచి ఉండాల్సిందే, సమస్య చెప్పాలంటే ఆగాల్సిందే, స్టేషన్ మొత్తం బిజీ బిజీ హడావిడి,పిలిసే వరకు పడిగాపులు కాయాల్సిందే, నల్లగుంట గ్రామం నుంచి గ్రామ సమస్యలపై పిటిషన్ ఇచ్చి మూడు రోజులు గడిచినా ఇప్పటి వరకు స్టేషన్ అధికారులు పిటిషన్ చూసింది లేదు. బాధితుల మీద చర్య తీసుకున్నది లేదు. గ్రామ పరిస్థితి ఇలా ఉంటే పిటిషన్ల దారుల పరిస్థితి ఏవిధంగా ఉందో ఆలోచించాల్సిందే,ఏదైనా అత్యవసర సమస్య మీద పిటిషన్ ఇవ్వాలన్న గంటలతరబడి బయట ఉండాల్సిందే ఎవరో ఒకరు వచ్చి చూసి పిలీసే వరకు పిటిషన్ దారులు బయట ఉండాల్సిందే, అక్కడ స్టేషన్లో పట్టించుకునే నాధులే కరువయ్యారు. ఆపద్బాంధవుల ఆదుకునే అధికారులే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా అని కొందరు పిటిషనర్లు వాపోతున్నారు. అధికారులు తమ సమస్యలపై పరిష్కారం దొరికేలా చూడాలని కోరుతున్నారు.