ఇంటర్ విద్యార్థులు గురుకులకు సీట్లకు దరఖాస్తు చేసుకోండి

-ప్రిన్సిపాల్ తిరుపతయ్య

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20 విద్యార్థులు గురుకుల బాలుర కళాశాలలో ఇంటర్మీడియట్ 2022 – 23 విద్యా సంవత్సరానికి ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో మిగిలిపోయిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని గురుకుల కళాశాలలో ఎంపీసీ గ్రూపులో ఎస్సీలకు 07, ఎస్టీలకు 02, బీసీలకు 02, ఓసీలకు 01, మైనార్టీలకు 01 సీట్లు మిగిలి ఉన్నాయని, బైపీసీ గ్రూపులో ఎస్సీలకు 05, ఎస్టీలకు 02, బీసీలకు 02, ఓసీలకు 01, మైనార్టీలకు 01 మిగిలిన సీట్లు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. 2021-2022 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో మొదటిసారి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆసక్తి ఉన్నట్లయితే విద్యార్థులు బదిలీ సర్టిఫికెట్ ,బోనఫైడ్, కులము, ఆదాయము సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను దరఖాస్తు ఫారానికి జతపరిచి ఈ నెల 23 లోగా మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు 98661 91383 నంబర్ ని సంప్రదించాలని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతయ్య తెలిపారు.