ఇండోనేషియాలో భారీ భూకంపం

జకార్తా, జనంసాక్షి: ఇండోనేషియాను భారీ భూకంపం మరోసారి కుదిపివేసింది. భూకంపం తాకిడీకి ఇండోనేషియా దీవులు చిగురుటాకులా వణికిపోయాయి. తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో ఇవాళ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీని తీవ్రత రిక్టల్‌స్కేలుపై 7.1గా పమోదైనట్లు భుగర్భ శాస్రవేత్తలు తెలిపారు. భూకంప తీవ్రతకు సంబదించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. కాగా, సునామీ ప్రమాదమేమీలేదని ఇండోనేషియా అధికారులు తెలిపారు.